Stock market: చివరి అరగంటలో అమ్మేశారు.. సూచీలకు నష్టాలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్‌ 188 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.

Published : 30 Apr 2024 16:04 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం రాణించిన సూచీలు.. గరిష్ఠాల వద్ద మదుపరులు అమ్మకాలకు దిగడంతో ఆఖర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా చివరి అరగంటలో సూచీలు ఒక్కసారిగా భారీగా కుదుపునకు లోనయ్యాయి. దీంతో ఇంట్రాడేలో 22,783.35 వద్ద సరికొత్త గరిష్ఠాలకు అందుకున్న నిఫ్టీ మళ్లీ 22,600 స్థాయికి చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 74,800 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. దాదాపు రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,111.39 పాయింట్ల వద్ద గరిష్ఠాలను తాకిన సూచీ.. తర్వాత కుదేలైంది. చివరికి 188.50 పాయింట్ల నష్టంతో 74,482.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 38.55 పాయింట్ల నష్టంతో 22,604.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.43గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభపడగా.. టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, సన్‌ఫార్మా ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 88.53 డాలర్లుగా కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని