ప్లీనరీ నుంచి వెళ్లకుండా గేట్లకు తాళాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం వైకాపా జిల్లా ప్లీనరీ జరిగింది. స్థానిక మోదకొండమ్మ ఆలయ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా

Published : 02 Jul 2022 05:11 IST

పాడేరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం వైకాపా జిల్లా ప్లీనరీ జరిగింది. స్థానిక మోదకొండమ్మ ఆలయ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు. సమావేశం మధ్యలో తనకు వేరే పని ఉందని సుబ్బారెడ్డి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెనుక ఎవరూ వెళ్లిపోకుండా నిర్వాహకులు ఆడిటోరియం గేట్లకు తాళాలు వేశారు. దీంతో లోపలున్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం మంచినీరు తాగేందుకూ బయటకు పంపలేదని వారు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని