GHMC: జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ.. పోడియం వద్ద తెరాస-భాజపా ‘ఢీ’
జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ భేటీ అయింది. ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ భేటీ అయింది. ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రజా సమస్యలను కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. తెరాస కార్పొరేటర్లు మాట్లాడుతూ భాజపా వాళ్లకు వరికి గోధుమలకు తేడా తెలియదని ఆరోపించారు. ఈ క్రమంలో తెరాస కార్పొరేటర్ కవిత చేసిన వ్యాఖ్యలపై భాజపా కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చించకుండా పక్కదారి పట్టస్తున్నారంటూ పోడియం వద్దకు నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఒకింత ఉద్రిక్తత తలెత్తింది. భాజపా కార్పొరేటర్ల ఆందోళన నేపథ్యంలో తెరాస కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని మేయర్ తెలిపారు.
అంతకుముందు ఎంఐఎం కార్పొరేటర్, మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. పన్నులు కట్టే వారికి జరిమానాలు విధిస్తున్నారన్నారని.. చెల్లించని వారి జోలికి అధికారులు వెళ్లడం లేదన్నారు. దీనిపై చర్యలు చేపడతామని మేయర్ ఆయనకు తెలిపారు.
తొలుత మేయర్ గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించాల్సిందిగా సభను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి, సౌకర్యాల కల్పనలో హైదరాబాద్ పురోగతి సాధిస్తోందని చెప్పారు. 2022-23 ఏడాదికి సంబంధించి రూ.6,150 కోట్లతో జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ఆమె ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రోడ్ల అభివృద్ధి స్కైవేలు, పై వంతెనలు కోసం రూ.1,500కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఎస్ఎన్డీపీలో భాగంగా చేపడుతున్న పనులకు రూ.340 కోట్లు, ఇతర నాలా పనుల నిర్వహణకు రూ.200కోట్లు, ఈ ఏడాది వరద నివారణ కోసం రూ.340 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నగరంలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. గ్రీనరీ పెంపునకు రూ.332.23 కోట్లతో గ్రీన్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు మేయర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్