Pramod Sawant: తెలంగాణ కంటే గోవాలోనే ఎక్కువ పథకాలు: ప్రమోద్ సావంత్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ విజయవంతంగా సాగుతోందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు.
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ విజయవంతంగా సాగుతోందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం కలుగుతోందని చెప్పారు. తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రమోద్ సావంత్.. గురువారం నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
గోవా వచ్చి చూడండి..
‘‘చివరి వ్యక్తి వరకూ సంక్షేమ పథకాలు అందడమే ప్రధాని మోదీ లక్ష్యం. డబుల్ ఇంజిన్ సర్కారు అన్ని రాష్ట్రాల్లో రావాలనేదే మా ఆకాంక్ష. ఆత్మనిర్భర్ భారత్ అమలుకు కృషి చేస్తున్నాం. గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. పర్యాటకులకు కూడా పూర్తి వ్యాక్సిన్ వేయించిన రాష్ట్రం గోవా. మా రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో గోవా వచ్చి చూడండి. గోవా తరహా అభివృద్ధి కావాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతాం.
వడ్డీలేని రుణాలు మేము కూడా ఇస్తున్నాం..
వితంతు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, రైతులకు వడ్డీలేని రుణాలు మేము కూడా ఇస్తున్నాం. తెలంగాణ కంటే ఎక్కువ పథకాలను అందిస్తున్నాం. పంచాయతీ స్థాయిలో గెజిటెడ్ అధికారులు ప్రతివారం పర్యటిస్తున్నారు. సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరేలా కృషి చేస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఈ నెల 14న తెలంగాణకు రాబోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గోవా ఎన్నికల్లో బాగా పని చేశారు. ఆయూష్ అభివృద్ధి కోసం జైపూర్లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటును అభినందిస్తున్నా’’ అని ప్రమోద్ సావంత్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్