పెట్రోల్, డీజిల్లపై అధిక పన్నులు నిజమే!
పెట్రోల్, డీజిల్పై ప్రభుత్వం అధిక పన్నులు వసూలు చేస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
దిల్లీ: పెట్రోల్, డీజిల్పై ప్రభుత్వం అధిక పన్నులు వసూలు చేస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్లపై సామాన్య ప్రజలనుంచి అధిక పన్నులు వసూలు చేస్తూ.. వారి మిత్రులకు పన్నులు, రుణాలను రద్దు చేస్తోంది. కేంద్ర మంత్రి ప్రకటనతో ఇదే విషయం స్పష్టంగా తెలిసింది’ అని రాహుల్ గాంధీ ట్విటర్లో విమర్శించారు. గడిచిన ఏడేళ్లలో ఇంధన ధరలు రెట్టింపు అయ్యాయని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో చేసిన ప్రకటను ప్రస్తావిస్తూ ట్విటర్లో రాహుల్ గాంధీ స్పందించారు.
వంటగ్యాస్ సిలిండర్ ధర గత ఏడేళ్లలో రెట్టింపై ప్రస్తుతం రూ.819కి చేరుకుందని పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో సోమవారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పెట్రోలు, డీజిల్పై పన్నులు రూపేణా 2013లో రూ.52,537 కోట్లు లభిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలల్లో రూ.2.94 లక్షల కోట్లు వచ్చిందని తెలిపారు. గత ఏడేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్లపై పన్నుల శాతం దాదాపు 459శాతం పెరిగినట్లు వెల్లడైంది.
భాజపా ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోన్న కాంగ్రెస్, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆ విమర్శనాస్త్రాలకు మరింత పదునుపెడుతోంది. 2014 ఎన్డీయే అధికారంకి వచ్చిన అనంతరం ఇప్పటివరకు పెట్రోలియం ఉత్పత్తులపై దాదాపు రూ.21లక్షల కోట్లను వసూలు చేసిందంటూ విమర్శిస్తోంది. ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టిందో కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలని పట్టుబడుతోంది. ఇదే విషయంపై చర్చ జరగాలని పార్లమెంట్ రెండో రోజు సమావేశాల్లోనూ పట్టుబట్టిన కాంగ్రెస్ సభను స్తంభింపజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.