CM Bommai: డీకేఎస్ మా MLAలకు ఫోన్లు చేసి ఆఫర్లు ఇస్తున్నారు.. సీఎం బొమ్మై
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఆఫర్లు ఇస్తున్నారని కర్ణాటక సీఎం, భాజపా నేత బసవరాజ్ బొమ్మై ఆరోపించారు.
బాగల్కోట్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka assembly polls)సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Basavaraj bommai) కాంగ్రెస్(Congress) కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్(DK shivakumar)పై తీవ్ర ఆరోపణలు చేశారు. భాజపా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందని.. ఆ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని స్థానాల్లో సీట్లు ఇస్తామంటూ ఆశచూపుతోందన్నారు. మంగళవారం బాగల్కోట్లో బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ గత రెండు మూడు రోజులుగా ఆ పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయని 100 నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. భాజపా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తే టిక్కెట్ఇస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశతో ఉన్నారు. వాళ్లకు సరైన అభ్యర్థులు కూడా లేరు. అందుకే ఆయన భాజపా నేతలకు ఫోన్లు చేస్తున్నారు. ఇదీ కాంగ్రెస్ పరిస్థితికి నిదర్శనం’’ అన్నారు.
మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 234 స్థానాలకు గాను 124 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసి మార్చి 25న ప్రకటించింది. ఇంకా 100 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇంకోవైపు, ఏప్రిల్ తొలి వారంలో భాజపా తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో 150 సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్, భాజపా నేతలు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?