KTR: పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌కు ఇదేనా చిత్తశుద్ధి: కేటీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వనీతి అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆక్షేపించారు.

Published : 07 Apr 2024 16:16 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వనీతి అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆక్షేపించారు. భారాస ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఎక్స్‌ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీలోకి వెళితే వెంటనే అనర్హులు అయ్యేలా చట్టసవరణ చేస్తామని లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్‌.. ఇవాళ సిగ్గు లేకుండా భారాస ఎమ్మెల్యేను చేర్చుకుందని విమర్శించారు. ‘పార్టీ ఫిర్యాయింపులపై నిన్న రాహుల్‌గాంధీ ఎన్నో మాట్లాడారు. గెలిచే వరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట అన్నట్టుగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది’ అని ఆక్షేపించారు. ఆ పార్టీ రీతి..నీతి ఇదేనా?అని ప్రశ్నించారు. భాజపాకు, కాంగ్రెస్‌కు తేడా ఏమిటని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని