India-US: ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసుపై వచ్చిన మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు అమెరికా విదేశాంగశాఖ అధికారి నిరాకరించారు. ఈ అంశంతో తాము న్యూదిల్లీతో టచ్లోనే ఉన్నామన్నారు.
వాషింగ్టన్: సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు అమెరికా (USA)లో జరిగిన కుట్ర వెనుక భారత (India) గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రచురించిన కథనం వివాదాస్పదమైంది. ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతం కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు.
‘‘ఈ కేసులో భారత్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కనుగొన్న అంశాల ఆధారంగా న్యూదిల్లీ బాధ్యతాయుతంగా వ్యహరిస్తుందని భావిస్తున్నాం. కేసులో అదనపు అప్డేట్ల గురించి ఎప్పటికప్పుడు న్యూదిల్లీని ఆరా తీస్తున్నాం’’ అని పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ పోస్ట్ కథనం గురించి అడగ్గా.. ‘‘ఈ అంశంపై మేం భారత ప్రభుత్వంలోని సీనియర్ స్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నాం. అంతకు మించి మేం దీని గురించి వ్యాఖ్యానించలేను. దీన్ని న్యాయశాఖకు వదిలేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
అమెరికాలోని సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జె) సంస్థ అధికార ప్రతినిధి గురుపత్వంత్ సింగ్ ఖలిస్థానీల కీలక నేత. భారత ప్రభుత్వం అతనిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే, పన్నూ హత్యకు తమ గడ్డపై కుట్ర జరిగిందని గతేడాది ఆరోపించిన అమెరికా.. ఈ కేసులో ఓ భారతీయుడిపై అభియోగాలు కూడా మోపింది. ఈ క్రమంలోనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత ప్రభుత్వం ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే, ఈ కుట్రలో ‘రా’ అధికారి ప్రమేయం ఉందంటూ యూఎస్ మీడియాలో కథనం రావడం చర్చనీయాంశమైంది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘ఒక సున్నితమైన అంశంపై ఆ నివేదిక నిరాధారమైన, అనవసర ఆరోపణలు చేస్తోంది. వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, ఇతరుల నెట్వర్క్లపై యూఎస్ ప్రభుత్వం అందించిన భద్రతా సమస్యలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అది దర్యాప్తు కొనసాగిస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి ఊహాజనితమైన, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చవు’’ అని భారత విదేశాంగశాఖ మండిపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరయ్యేను ఖమేనీ వారసుడు?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో ఆ దేశ భవితవ్యంపై అంతర్గతంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఆసక్తి పెరుగుతోంది. తదుపరి అధ్యక్షుడు ఎవరనేది కాకుండా... దేశ సుప్రీం కమాండర్ ఎవరవుతారనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న! -
సింగపూర్ విమానంలో భారీ కుదుపులు
సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవడంతో ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. -
‘అవి రక్తంతో తడిసిన చేతులు’
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. నాలుగు దశాబ్దాలుగా ఇరాన్ ప్రజలపై కొనసాగుతున్న అణచివేతలో రైసీది కీలక పాత్ర అని పేర్కొంది. న్యాయమూర్తిగా, అధ్యక్షుడిగా ఆయన చేతులు రక్తంతో తడిసాయని, మరణంతో ఈ కఠోర వాస్తవం మారిపోదని తెలిపింది. -
షెంజెన్ వీసా రుసుములను పెంచిన ఐరోపా
ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చు మరింత భారం కానుంది. షెంజెన్ వీసా దరఖాస్తు రుసుంను 12 శాతం పెంచేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదించడమే అందుకు కారణం. జూన్ 11 నుంచి ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
బోకోహారమ్ ఉగ్రవాదుల చెరలోని 350 మంది బందీలకు విముక్తి
ఈశాన్య నైజీరియాలో బోకోహారమ్ ఉగ్రవాదుల చెరలో నెలలు, సంవత్సరాలు బందీలుగా ఉన్న 350 మందిని రక్షించినట్లు అక్కడి సైన్యం తెలిపింది. సాంబిసా అటవీ ప్రాంతంలో వీరిని బందీలుగా ఉంచినట్లు నైజీరియన్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ కెన్ చిగ్బు తెలిపారు. -
సంక్షిప్త వార్తలు(6)
ఆక్రమిత వెస్ట్బ్యాంకులోకి మంగళవారం ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించి ఏడుగురు పాలస్తీనీయన్లను హతమార్చాయి. ఇందులో ఓ వైద్యుడు కూడా ఉన్నారు. -
మానవ వృషణాల్లో సూక్ష్మ ప్లాస్టిక్లు
మానవ వృషణాల్లో సూక్ష్మ ప్లాస్టిక్లను పరిశోధకులు గుర్తించారు. దీంతో పురుషుల్లో వీర్య కణాలు తగ్గిపోవడానికి ఇవే కారణమై ఉంటాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. -
తబ్రిజ్లో రైసీ సంతాప యాత్ర
హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇతరుల స్మృత్యర్థం ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన సంతాప కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. -
ఐసీసీ అరెస్టు వారెంట్ల అభ్యర్థనకు ఫ్రాన్స్ మద్దతు
తమపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలంటూ అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి (ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చేసిన అభ్యర్థనపై గరంగరంగా ఉన్న ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బ తగిలింది. -
గూగులమ్మ ఇంట ఏఐ పంట
టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది. -
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం మార్గమధ్యలో తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని విమానాశ్రయానికి మళ్లించారు.
తాజా వార్తలు (Latest News)
-
అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయం.. రూ.300 కోట్లు ?
-
ఔటర్ చుట్టూ.. ఔరా అనిపించేలా
-
ఓటుకు ఊపిరిలూదిన ఊళ్లు.. 748 కేంద్రాల్లో 91 శాతానికి పైగా నమోదు
-
అతని తీరుతో అంతటా శోకం.. పోలీసు అధికారి వ్యవహార శైలిపై విమర్శలు
-
తల్లికి కుమార్తె నుంచి భరణం.. ఇందౌర్ కోర్టు తీర్పు
-
ఎమ్మెల్యేనా.. వీధి రౌడీనా!