Telangana news: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రేను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే నియమితులయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణికం ఠాగూర్ను రిలీవ్ చేసిన పార్టీ అధిష్ఠానం.. ఆయన స్థానంలో గోవా ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేను నియమించింది. మాణికం ఠాగూర్కు గోవా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై మాణికం ఠాగూర్ గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య వివాదం మరింత జఠిలం కావడానికి మాణికం ఠాగూర్ కూడా కారణమని సీనియర్ నేతలు ఆరోపించారు. వివాదం మొదలైనప్పుడు వెంటనే ఆయన స్పందించలేదు, పీసీసీకి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారనేది సీనియర్ల ఆరోపణ. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయే క్రమంలో ఏఐసీసీ జోక్యం చేసుకుంది. ఈనేపథ్యంలోనే మాణికం ఠాగూర్ తెలంగాణ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వైదొలిగినట్టు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది. -
ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలి
మహిళలపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణను వెంటనే అరెస్టు చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు.