Manipur Polls: మణిపూర్ ఎన్నికల్లో హింస.. ముగిసిన మలి విడత పోలింగ్!
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల మలి విడత పోలింగ్ సైతం హింసాత్మక ఘటనల మధ్యే ముగిసింది. శనివారం మొత్తం 22 నియోజకవర్గాల్లో....
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మలి విడత పోలింగ్లో సైతం పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శనివారం మొత్తం 22 నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్ జరగ్గా.. సాయంత్రం 5గంటల వరకు 76.04శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరోవైపు, పోలింగ్కు ముందు, తర్వాత పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఓటింగ్కు అంతరాయం ఏర్పడింది. కరోంగ్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం వద్ద హింస చోటుచేసుకోవడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందారు.
సేనాపతి జిల్లాలో అత్యధికంగా 82.02శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత తౌబాల్ జిల్లాలో 78శాతం పోలింగ్ నమోదైంది. తొలి విడతలో పలుచోట్ల హింస చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన అధికారులు.. ఈసారి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే, మొత్తం 1247 పోలింగ్ కేంద్రాల పరిధిలో కొవిడ్ నిబంధనల మధ్య పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 92మంది అభ్యర్థులు నిలవగా.. 8.38లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ఒ.ఇబోబి సింగ్ తౌబాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఒకవేళ ఒకట్రెండు సీట్లు తక్కువైనా పొత్తులకు తాము సిద్ధమేనని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!