Kaushik Reddy: జాతీయ మహిళా కమిషన్‌ ఎదుట హాజరైన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైపై చేసిన వ్యాఖ్యల అంశంలో జాతీయ మహిళా కమిషన్‌ ఎదుట భారాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు.

Published : 21 Feb 2023 14:04 IST

దిల్లీ: తెలంగాణ గవర్నర్‌ తమిళిసైపై చేసిన వ్యాఖ్యల అంశంలో జాతీయ మహిళా కమిషన్‌ ఎదుట భారాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఎమ్మెల్సీని మహిళా కమిషన్‌ విచారించింది. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల లిఖిత పూర్వకంగా, మౌఖికంగా ఆయన వివరణ ఇచ్చారు. మహిళా కమిషన్‌కు ఇచ్చిన వివరణపై పూర్తిస్థాయి వివరాలను హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి వెల్లడిస్తానని కౌశిక్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని