MP Komatireddy: నల్గొండ సీటు త్యాగం చేయడానికి సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

బీసీల కోసం నల్గొండ సీటును త్యాగం చేయడానికి సిద్ధమని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 29 Aug 2023 19:44 IST

హైదరాబాద్‌: బీసీల కోసం నల్గొండ సీటును త్యాగం చేయడానికి సిద్ధమని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఆరు దరఖాస్తులు వచ్చాయని అందరి బలాబలాలు పరిశీలిస్తామని తెలిపారు. సమర్థులైన వారికే టికెట్లు ఇస్తామన్నారు. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ వన్‌ టూ వన్‌ మాట్లాడాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, ఆ ప్రతిపాదనకు అందరం ఆమోదించినట్టు తెలిపారు. ఎన్నికల ముందు కేటీఆర్‌ అమెరికా పర్యటనలో ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని