Nara LoKesh: పేదల కాలనీని రాత్రికి రాత్రి మాయం చేసింది నిజం కాదా?: నారా లోకేశ్‌

ధనిక ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వర్సెస్ పేదలు పేరిట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఓ వీడియోను విడుదల చేశారు.

Published : 18 May 2023 22:49 IST

అమరావతి: ధనిక ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వర్సెస్ పేదలు పేరిట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఓ వీడియోను విడుదల చేశారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని దిగమింగిన అవినీతి అనకొండ ఇప్పుడు తానొక పేదవాడినని అంటోందని దుయ్యబట్టారు. పేదలంటే ప్రాణమంటూ.. పేదల కోసం అవతరించిన మహానుభావుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2019 వరకు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అమరారెడ్డి కాలనీ ఉండేదని.. సుమారు 1000 పేద కుటుంబాలు అక్కడ నివసించేవని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే తాడేపల్లి ప్యాలెస్‌కు మరో రాజమార్గం కావాలని చెప్పి ఆ పేదల కాలనీని రాత్రికి రాత్రి మాయం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అమరారెడ్డి కాలనీ ఏమైందని నిలదీశారు. జగన్‌ అబద్ధం చెప్తాడనే తాజా గూగుల్ మ్యాప్‌ను చూపిస్తున్నట్లు తెలిపారు. పేదల గురించి మాట్లాడే అర్హత జగన్‌ ఉందా అని ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని