Nitin Gadkari: ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం.. ఉద్ధవ్ ఆఫర్పై గడ్కరీ
మహా వికాస్ అఘాడీ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపిస్తామంటూ ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
దిల్లీ: భాజపా (BJP)కు రాజీనామా చేసి వస్తే.. ‘మహావికాస్ అఘాడీ’ (MVA) తరఫున పోటీకి అవకాశం కల్పిస్తామని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)స్పందించారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా, పరిణతిలేనివిగా ఉన్నాయని అన్నారు. కొద్ది రోజుల క్రితం భాజపా ప్రకటించిన తొలి జాబితాలో గడ్కరీ పేరు లేకపోవడంతో ‘‘ దిల్లీ ముందు తలవంచే బదులు ఆ పార్టీకి రాజీనామా చేస్తే.. అఘాడీ అభ్యర్థిగా నిలబెడతాం’’ అని ఇటీవల ఓ సభలో ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. అప్పట్లో దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) స్పందించారు. గడ్కరీ వంటి జాతీయ నేతకు ఉద్ధవ్ లాంటి వ్యక్తి ఆఫర్ ఇవ్వడమంటే.. అమెరికాకు అధ్యక్షుడిగా చేస్తానంటూ ఒక సాదాసీదా వ్యక్తి మరొకరికి హామీ ఇవ్వడం లాంటిదేనని ఎద్దేవా చేశారు.
తాజాగా మరోసారి గడ్కరీని ఎమ్వీఏ అభ్యర్థిగా పోటీ చేయాలని ఉద్ధవ్ కోరారు. దీనిపై నితిన్ గడ్కరీ స్పందించారు. ‘‘భాజపాలో అభ్యర్థులకు టికెట్లు కేటాయించేందుకు ఒక విధానం ఉంది. దాని ప్రకారం కేటాయింపులు జరుగుతాయి’’ అని తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గడ్కరీ నాగ్పూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో భాజపా, ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ పార్టీలతో కలిసి ‘మహాయుతి’ కూటమిగా ఎన్నికల బరిలో నిలవనుంది. దీంతో సీట్ల సర్దుబాటుపై కూటమిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో భాజపా అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం అజిత్ పవార్ వర్గానికి నాలుగు లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. భాజపా 31 స్థానాలు, శివసేన (ఏక్నాథ్ శిందే) 13 స్థానాల్లో పోటీ చేయనుందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం