Rahul Gandhi: పార్లమెంట్ను నడిపే విధానం ఇదికాదు: రాహుల్ ఆగ్రహం
రాజ్యసభలో 12మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు మంగళవారం కూడా తమ .....
దిల్లీ: రాజ్యసభలో 12మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు మంగళవారం కూడా తమ నిరసనలు కొనసాగించాయి. ఇదే అంశంపై పార్లమెంట్ నుంచి విజయ చౌక్ వరకూ విపక్ష పార్టీల ఎంపీలు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విపక్షాల గొంతుకను అణచివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్యచేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పార్లమెంట్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు విపక్ష పార్టీలకు అనుమతి ఇవ్వడంలేదన్నారు. చర్చల్లేకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయన్న రాహుల్.. ప్రధాని మోదీ కూడా సభకు హాజరు కావడంలేదని విమర్శించారు. 12 మంది ఎంపీలను సస్పెండ్ చేసి రెండు వారాలవుతోందని, ఆ ఎంపీలంతా బయటే కూర్చొంటున్నారన్నారు. పార్లమెంట్ను నడిపే విధానం ఇది కాదంటూ రాహుల్ మండిపడ్డారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!