LJP: జాతీయ అధ్యక్షుడిగా పశుపతి పరాస్
పశుపతి పరాస్ గురువారం లోక్జన శక్తి పార్టీ(ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన చిరాగ్ చిన్నాన్న
దిల్లీ: పశుపతి పరాస్ గురువారం లోక్జన శక్తి పార్టీ(ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే ఆయన్ను లోక్సభాపక్ష నేతగా గుర్తిస్తూ లోక్సభ సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దళిత నేత, దివంగత రాంవిలాస్ పాసవాన్ నెలకొల్పిన ఎల్జేపీలో కొద్ది రోజుల క్రితం తిరుగుబాటు జెండా ఎగిరింది. ఆయన చిన్న తమ్ముడు పశుపతి ఇందుకు నాయకత్వం వహించారు. రాంవిలాస్ కుమారుడు, లోక్సభ సభ్యుడు చిరాగ్ పాసవాన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. చిరాగ్తో కలిసి ఆ పార్టీ తరఫున ఆరుగురు లోక్సభ సభ్యులుండగా, అందులో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారు. చిరాగ్ను పార్టీలో ఒంటరిని చేశారు.
మరోపక్క ఎల్జేపీ లోక్సభాపక్ష నేతగా పశుపతి నియామకం చెల్లదని, ఇది పార్టీ నిబంధనలకు విరుద్ధమని బుధవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు చిరాగ్ లేఖ రాశారు. తనను ఎల్జేపీ లోక్సభాపక్ష నాయకుడిగా గుర్తించి కొత్త సర్క్యులర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు వ్యతిరేకంగా చేతులు కలిపిన ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్జేపీలో చీలిక నేపథ్యంలో చిరాగ్ మీడియాతో మాట్లాడుతూ..తనను తాను ‘సింహం బిడ్డ’గా అభివర్ణించుకున్నారు. తన తండ్రి పార్టీని స్థాపించిన లక్ష్యం కోసం పోరాడతానని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!