Pawan Kalyan: జ్వరం నుంచి కోలుకున్న పవన్‌.. 7 నుంచి మళ్లీ జనంలోకి..

తీవ్రమైన జ్వరం కారణంగా వారాహి విజయభేరి సభలకు తాత్కాలిక విరామం ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తదుపరి పర్యటనకు సిద్ధమవుతున్నారు.

Published : 05 Apr 2024 17:20 IST

అమరావతి: తీవ్రమైన జ్వరం కారణంగా వారాహి విజయభేరి సభలకు తాత్కాలిక విరామం ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తదుపరి పర్యటనకు సిద్ధమవుతున్నారు. జ్వరం నుంచి కోలుకున్న ఆయన.. ఈ నెల 7 నుంచి యథాతథంగా తన ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగించనున్నారు. ఈ విషయాన్ని పవన్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. వారాహి విజయ భేరి యాత్రలో భాగంగా ఈ నెల 7న అనకాపల్లిలో సభ నిర్వహిస్తారని తెలిపారు. 8వ తేదీన ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. 9న పవన్‌ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు