Pawan Kalyan: జేపీ నడ్డాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ బుధవారం కేంద్రమంత్రులు అమిత్‌షా, మురళీధరన్‌తో సమావేశం కాగా.. నేడు నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా కొనసాగింది.

Updated : 20 Jul 2023 13:33 IST

దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ బుధవారం కేంద్రమంత్రులు అమిత్‌షా, మురళీధరన్‌తో సమావేశం కాగా.. నేడు నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా కొనసాగింది.

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, భాజపా రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితర అంశాలపై నడ్డా, పవన్‌ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి పవన్‌ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పవన్‌ వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని