Andhra News: ఆత్మకూరులో ముగిసిన పోలింగ్‌.. పలుచోట్ల వైకాపా, భాజపా మధ్య ఘర్షణ

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌మీనా తెలిపారు.  ఎలాంటి

Published : 23 Jun 2022 20:54 IST

అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌మీనా తెలిపారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వివరించారు. దాదాపు 70శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశముందన్నారు. ఓ పోలింగ్‌ కేంద్రంలో ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నించిన కొందరిని పోలీసులు అడ్డుకుని పంపించేశారని తెలిపారు. కొన్ని చోట్ల భాజపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని