Andhra News: బుగ్గనకు ఆర్థికం.. వనితకు హోం.. ఏపీ మంత్రుల శాఖలివే
ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ కొత్త కేబినెట్లోని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. అయిదుగురికి ఉప ముఖ్యమంత్రుల పదవులను కట్టబెట్టింది. వారిలో రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి ఉన్నారు...
అమరావతి: ఏపీ కొత్త కేబినెట్లోని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. గత కేబినెట్ తరహాలోనే అయిదుగురికి ఉప ముఖ్యమంత్రుల పదవులను కట్టబెట్టింది. రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి ఉపముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారు.
గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి ఈసారీ ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్ చేపట్టిన శాఖలలో మార్పులు చేసి విద్యా శాఖను బొత్సకు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను సురేశ్కు కేటాయించారు. మొదటి నుంచీ రాష్ట్ర హోం శాఖను నగరి ఎమ్మెల్యే రోజాకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా హోంశాఖను తానేటి వనితకు కేటాయించారు. గతంలో మేకతోటి సుచరిత హోంశాఖ మంత్రిగా ఉన్నారు. రోజాకు రాష్ట్ర పర్యాటక, యువజన, క్రీడల శాఖను కేటాయించారు. ఆళ్లనానికి గతంలో వైద్యారోగ్యశాఖ కేటాయించగా.. ఇప్పుడు ఆ శాఖను విడదల రజనీకి కేటాయించారు. పౌరసరఫరాల బాధ్యతను గతంలో కొడాలి నాని చూడగా.. ఈసారి కారుమూరి నాగేశ్వరరావుకు కేటాయించారు. వ్యవసాయశాఖ బాధ్యతలను కురసాల కన్నబాబు నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అప్పగించారు.
మంత్రులు.. కేటాయించిన శాఖలు
- ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
- సీదిరి అప్పలరాజు - పశుసంవర్ధక, మత్స్యశాఖ
- దాడిశెట్టి రాజా - రహదారులు, భవనాల శాఖ
- గుడివాడ అమర్నాథ్ - పరిశ్రమలు, ఐటీ శాఖ
- వేణుగోపాల్ - బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాల శాఖ
- తానేటి వనిత - హోం శాఖ
- జోగి రమేష్ - గృహనిర్మాణ శాఖ
- కారుమూరి నాగేశ్వరరావు - పౌర సరఫరాల శాఖ
- మేరుగ నాగార్జున - సాంఘిక సంక్షేమ శాఖ
- విడదల రజని - వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
- కొట్టు సత్యనారాయణ - దేవాదాయ శాఖ
- అంబటి రాంబాబు- జలవనరుల శాఖ
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- గనులు, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ
- బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళిక శాఖ
- కె.నారాయణ స్వామి- ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ
- బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
- ఆదిమూలపు సురేశ్- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
- కాకాణి గోవర్ధన్ రెడ్డి- వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖలు
- ఆర్కే రోజా- పర్యాటక, యువజన, క్రీడల శాఖ
- పీడిక రాజన్న దొర- ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమం
- బూడి ముత్యాలనాయుడు- ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
- అంజాద్ బాషా- ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమం
- గుమ్మనూరు జయరాం- కార్మిక శాఖ
- ఉషశ్రీ చరణ్- మహిళా శిశుసంక్షేమశాఖ
- పినిపే విశ్వరూప్ - రవాణాశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్