PK: సంచలన నిర్ణయం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహిస్తోన్న ఐ-పాక్(I-PAC) సంస్థ వ్యూహకర్త బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మళ్లీ రాజకీయాల్లో చేరికపైనా స్పష్టత
దిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహిస్తోన్న ఐ-పాక్(I-PAC) సంస్థ వ్యూహకర్త బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం చేస్తోన్న పనుల నుంచి విరామం తీసుకునే సమయం వచ్చిందని ఓ జాతీయ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి రావడంతో పాటు భాజపా రెండంకెల స్థానాలు గెలువదని ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే పీకే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.
‘ప్రస్తుతం నేను చేస్తున్న(ఎన్నికల వ్యూహకర్తగా) వాటిని తదుపరి కొనసాగించాలని అనుకోవడం లేదు. ఇప్పటివరకు తగినంత చేశాను. ప్రస్తుతం వీటి నుంచి విరామం తీసుకొని జీవితంలో ఇంకేదైనా చేయాల్సిన సమయం వచ్చింది. ఇక పూర్తిగా (వ్యూహకర్తగా) వీటిని వదిలివేయాలి అనుకుంటున్నా’ అని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. అయితే, మీరు మళ్లీ నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా? అని అడిగిన ప్రశ్నకు..నేను ఓ విఫలమైన రాజకీయ నాయకుడినని సమాధానమిచ్చారు. భవిష్యత్తులో ఏమీ చేయాలో అనే విషయాన్ని ఆలోచించుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తోన్న ఐపాక్(I-PAC Indian Political Action Committee)ను కొనసాగించడానికి సమర్థనాయకత్వం ఉందని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.
పశ్చిమబెంగాల్లో ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు ప్రశాంత్ కిశోర్ మధ్య ట్విటర్ వేదికగా మాటలయుద్ధం నెలకొంది. దాంతో కాషాయ పార్టీకి కౌంటర్ ఇస్తూ గతేడాది డిసెంబరు పీకే ఓ ట్వీట్ చేశారు. ‘‘వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో భాజపా రెండంకెల కంటే మించి సీట్లు సాధించలేదు. అంతకంటే ఎక్కువ సీట్లు వస్తే నేను ప్రస్తుతం చేపట్టిన బాధ్యతల నుంచి శాశ్వతంగా వీడుతా’’ అని ఆయన సవాల్ విసిరారు. అయితే, ఆయన చెప్పినట్లుగానే తృణమూల్, భాజపా ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. మళ్లీ తృణమూల్ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. అయినప్పటికీ తాను ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు పీకే ప్రకటించారు.
ఇదిలాఉంటే, పశ్చిమ బెంగాల్లోపాటు తమిళనాడులో స్టాలిన్ తరపున పీకే వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆయన అంచనా వేసినట్లుగానే అటు మమతా బెనర్జీ, స్టాలిన్ విజయం సాధించారు.ఇక జేడీయూ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్పై గతేడాది ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను బహిష్కరిస్తున్నట్లు జేడీయూ ప్రకటించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్