Munugode Bypoll: మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఎవరికి?: ఆశావహులతో రేవంత్ భేటీ
మునుగోడు ఉప ఎన్నికకు త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలను వేగవంతం చేసింది. ఈనెలాఖరులోపు అభ్యర్థిని ప్రకటిస్తామని
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలను వేగవంతం చేసింది. ఈనెలాఖరులోపు అభ్యర్థిని ప్రకటిస్తామని ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలతో రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. గాంధీభవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ తదితరులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.
అనంతరం హైదర్గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్తో రేవంత్రెడ్డి, భట్టివిక్రమార్క, రాంరెడ్డి దామోదర్రెడ్డి సమావేశమయ్యారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై సాయంత్రానికి ఏఐసీసీకి పీసీసీ నివేదిక పంపనుంది. ఏఐసీసీ ఆమోదించిన వారినే మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిగా పీసీసీ ప్రకటించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.