Munugode Bypoll: మునుగోడు కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి?: ఆశావహులతో రేవంత్‌ భేటీ

మునుగోడు ఉప ఎన్నికకు త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ చర్యలను వేగవంతం చేసింది. ఈనెలాఖరులోపు అభ్యర్థిని ప్రకటిస్తామని

Updated : 25 Aug 2022 14:57 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికకు త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ చర్యలను వేగవంతం చేసింది. ఈనెలాఖరులోపు అభ్యర్థిని ప్రకటిస్తామని ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నేతలతో రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. గాంధీభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్‌ తదితరులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.

అనంతరం హైదర్‌గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణికం ఠాగూర్‌తో రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సమావేశమయ్యారు. టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై సాయంత్రానికి ఏఐసీసీకి పీసీసీ నివేదిక పంపనుంది. ఏఐసీసీ ఆమోదించిన వారినే మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిగా పీసీసీ ప్రకటించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని