RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భారాసలో చేరారు.

Updated : 18 Mar 2024 19:58 IST

హైదరాబాద్‌: బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భారాసలో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్‌తోపాటు పలువురు నేతలు కూడా భారాసలో చేరారు. ఇటీవల భారాస-బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పొత్తును విరమించుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేశారు.

భారాసలో చేరేముందు మీడియాతో ప్రవీణ్‌ మాట్లాడారు. ప్రత్యేక పరిస్థితుల్లో గులాబీ పార్టీలోకి మారాల్సి వస్తోందని తెలిపారు. ‘‘ సీఎం రేవంత్‌రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారు. ప్యాకేజీ తీసుకునే వాడినైతే అధికార పార్టీలో చేరేవాడిని. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో ప్రవీణ్‌ ఉండరు’’అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని