Andhra News: విభజన జరిగి ఏడేళ్లు.. రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి: రామ్మాధవ్
దేశంలో మంచి వ్యవస్థల్ని నెలకొల్పినప్పుడే ప్రజలు ఎక్కడకు వెళ్లినా గౌరవం లభిస్తుందని భాజపా సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ నాయకులు రామ్ మాధవ్ అన్నారు. గుంటూరులోని
గుంటూరు: దేశంలో మంచి వ్యవస్థల్ని నెలకొల్పినప్పుడే ప్రజలు ఎక్కడకు వెళ్లినా గౌరవం లభిస్తుందని భాజపా సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ నాయకులు రామ్ మాధవ్ అన్నారు. గుంటూరులోని జీకే కన్వెన్షన్ సెంటర్లో సమాలోచన సంస్థ నిర్వహించిన ‘స్వాధీనత నుంచి స్వతంత్రత వైపు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా మన దేశంలో ఇంకా స్వాభిమానం అలవాటు కాలేదని.. దీనికి అవినీతి రాజకీయ వ్యవస్థలే కారణమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు గడిచినా ఇంకా మనకు రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొందని... ఇది మన రాజకీయ వ్యవస్థలోని లోపం కాదా? అని ప్రశ్నించారు.
దేశంలో తాజాగా నెలకొన్న హిజాబ్ వివాదంపైనా స్పందించారు. అరబ్ దేశాల్లో ముస్లిం మహిళలు బురఖాకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్నారని, సౌదీలో బురఖా అవసరం లేదని అక్కడి రాజు ప్రకటించారని తెలిపారు. కానీ, మనదేశంలో మాత్రం బురఖా ధరించాలని చెప్పి దాన్ని మత సమస్యగా మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది దేశంలో మతపరమైన విభజన తెచ్చేందుకు ప్రయత్నించటమేనని అభిప్రాయపడ్డారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అందరూ ప్రధాని మోదీ సాయం కోరుతున్నారని తెలిపారు. కానీ, మనం శాంతి వైపు ఉన్నామని, అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటామని రామ్మాధవ్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!