శశికళకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరులోని సెంట్రల్ జైలులో అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న ఆమెను జైలు అధికారులు.........
బెంగళూరు: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరులోని సెంట్రల్ జైలులో అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న ఆమెను జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. రాత్రి నుంచి శ్వాసతీసుకోవడంలో కూడా ఇబ్బంది పడటంతో ఆమెకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్ నెగెటివ్గా తేలింది. అయితే, మరింత కచ్చితత్వం కోసం ఆమెకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేసినట్టు సమాచారం. మరికొద్ది గంటల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. జైలులోని ఆస్పత్రిలో చేరే సమయంలో ఆమె రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటంతో కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తంచేసినట్టు సమాచారం. దీంతో ఆమెను బెంగళూరులోని బోరింగ్ ఆస్పత్రికి తరలించారు. శశికళ ఆరోగ్య పరిస్థితి గురించి జైలు అధికారులు ఆమె లీగల్ టీంకు సమాచారం ఇచ్చారు.
అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి ఈ నెల 27న విడుదల కానున్నట్ట్టు ఆమె తరఫు న్యాయవాది రాజా సెంథూరపాండియన్ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
27న శశికళ విడుదల: మళ్లీ AIADMKలో చేరతారా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.