2020లో భాజపా ప్రయత్నాలన్నీ విఫలం
దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలనే భ్రమ నుంచి భాజపా బయటకు రావాలని శివసేన పేర్కొంది. ఇకముందూ అలాంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ఘాటు హెచ్చరికలు చేసింది. ఈ
శివసేన
ముంబయి: దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలనే భ్రమ నుంచి భాజపా బయటకు రావాలని శివసేన పేర్కొంది. ఇకముందూ అలాంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ఘాటు హెచ్చరికలు చేసింది. ఈ మేరకు శివసేన తన అధికార పత్రిక సామ్నాలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈడీ వంటి సంస్థలను ఉపయోగించాలనే మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి. ఇలాంటి చర్యల వల్ల ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు వేగంగా క్షీణిస్తున్నాయి’ అని శివసేన విమర్శించింది.
‘ఉద్ధవ్ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 2020లో మీరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ కోరుకునే ప్రభుత్వం ఇంకా 25 ఏళ్లు గడిచినా రాదు. ఈడీని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకునే భ్రమ నుంచి ఇకనైనా భాజపా బయటకు రావాలి. ఇటీవల భాజపా నుంచి బయటకు వచ్చిన ఏక్నాథ్ ఖడ్సేకు సైతం ఈడీ నుంచి నోటీసులు పంపారు. ఇలా ఎన్సీపీ నేత శరద్పవార్, శివసేన నేత ప్రతాప్ సర్నాయక్ ఇంకా పలువురు నాయకులపై ఈడీ దాడులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి’ అని శివసేన భాజపాపై మండిపడింది.
‘సంజయ్రౌత్కు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదా అని భాజపా నేత చంద్రకాంత్ పాటిల్ అడుగుతున్నారు. మరి పాటిల్కు రాజ్యాంగం పట్ల అంత గౌరవం ఉంటే.. అదే ప్రశ్న రాష్ట్ర గవర్నర్ కోశ్యారీకి వేయండి. గవర్నర్ కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదని గవర్నర్ను ప్రశ్నించండి’ అని శివసేన దీటుగా బదులిచ్చింది.
ఇటీవల శివసేన ఎంపీ సంజయ్రౌత్ భార్య వర్షకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. పీఎంసీ బ్యాంకు కుంభకోణం కేసులో ఆమెకు సంబంధాలున్నట్లు ఈడీ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఆమె డిసెంబర్ 29న విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. వెళ్లకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఇటీవల భాజపాకు రాజీనామా చేసి ఎన్సీపీలో చేరిన ఏక్నాథ్ ఖడ్సేకు సైతం మనీ లాండరింగ్ కేసులో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ఈడీ నోటీసులు జారీ చేసింది. మరో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఇంటిపైనా దాడులు చేసింది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!