వారసత్వ రాజకీయాలే ఆ పార్టీల లక్ష్యం: షా
డీఎంకే పార్టీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్షా విమర్శించారు. ఇటీవల డీఎంకే నేత రాజా సీఎం పళనిస్వామి తల్లి గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను షా తీవ్రంగా తప్పుబట్టారు.
చెన్నై: డీఎంకే పార్టీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్షా విమర్శించారు. ఇటీవల డీఎంకే నేత రాజా సీఎం పళనిస్వామి తల్లిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను షా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన గురువారం తిరుకోయిలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. రాష్ట్రంలో ఏప్రిల్ 6న జరగబోయే ఎన్నికల్లో మహిళలంతా డీఎంకే పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
‘కాంగ్రెస్, డీఎంకే పార్టీలు అవినీతి, వారసత్వ రాజకీయాలు చేస్తాయి. ఒక దివంగత మహిళపై డీఎంకే నేత రాజా చేసిన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ పార్టీకి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలోనూ డీఎంకే నేతలు దివంగత మాజీ సీఎం జయలలితపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పార్టీకి మహిళలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఎన్నికల సమరం అభివృద్ధి పథంలో నడిచే ఎన్డీయేకు.. అవినీతి, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే యూపీఏకు మధ్య జరుగుతోంది’ అని షా మండిపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఓ వైపు కాంగ్రెస్ నాయకురాలు సోనియగాంధీ తన కుమారుడు రాహుల్కు అధికారం అందించే బెంగతో ఉండగా.. మరోవైపు డీఎంకే నేత స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి మీద బెంగతో ఉన్నారని విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన