మోదీ చూపిన శ్రద్ధ మరువలేనిది: చిరాగ్
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ప్రభుత్వ పనితీరుపై రిపోర్ట్ కార్డు ఇవ్వాలంటూ లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు
పట్నా: ప్రభుత్వ పనితీరుపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రిపోర్ట్ కార్డు ప్రజల ముందుంచాలంటూ లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. 15 సంవత్సరాల పాటు ‘సుశాసన్ బాబు’గా ప్రచారం పొందిన నితీశ్ అవినీతి బట్టబయలవుతోందని విమర్శించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఆయన నితీశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
‘నితీశ్ ‘సుశాసన్ బాబు’ ట్యాగ్తో 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కానీ, ఆయన దోపిడీ ఇప్పుడు బహిర్గతం అవుతోంది. ముంగర్ ఘటన గురించి ఆయన ఎప్పుడు ఒక్కమాట మాట్లాడలేదు. అవినీతి గురించి ప్రస్తావనే లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన ఆయన, 2015లో వారితోనే జట్టుకట్టి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు’ అంటూ విమర్శలు చేశారు. జేడీయూ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి రిపోర్టు కార్డు ఇవ్వాలంటూ నితీశ్ను చిరాగ్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. మరోవైపు, తన తండ్రి రాంవిలాస్ పాసవాన్ చివరి రోజుల్లో ప్రధాని మోదీ చూపిన శ్రద్ధ పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల అనారోగ్యంతో రాంవిలాస్ పాసవాన్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అలాగే, కొద్దిరోజుల క్రితం లీకైన వీడియో గురించి మాట్లాడుతూ..తన తండ్రి మరణాన్ని తాను లెక్క చేయలేదంటూ కొందరు నా పేరును దెబ్బతీయాలనుకున్నారని మండిప్డడారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన చిరాగ్..అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఒకవైపు నితీశ్ కుమార్పై విమర్శలు చేస్తూ..ప్రధాని మోదీకి అభిమానినంటూ చెప్పుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!