AP News: రాజధాని కట్టకుండా సెస్ ఎందుకు వసూలు చేస్తున్నారు: సోము వీర్రాజు
మాట తప్పను.. మడమ తిప్పనని చెప్పిన జగన్ మోహన్రెడ్డి ఎన్నో వాగ్దానాలు చేసి రాజధానిని ఎక్కడికి పట్టుకెళ్లారని ...
విజయవాడ: మాట తప్పను.. మడమ తిప్పనని చెప్పిన జగన్ మోహన్రెడ్డి ఎన్నో వాగ్దానాలు చేసి రాజధానిని ఎక్కడికి పట్టుకెళ్లారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని కట్టకుండా ఇవాళ్టికి కూడా రూ.4 సెస్ ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీశారు. రోడ్ల కోసమని రెండు రూపాయలు చొప్పున సెస్ వసూలు చేస్తున్నారు. కానీ, రోడ్ల మరమ్మతులు ఎక్కడ చేస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ఆంధ్ర ప్రదేశ్ను అదోగతిపాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి దానికి జీఎస్టీ ఉన్నప్పుడు.. మద్యం అమ్మకాలకు బిల్లులు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రానికి కేంద్రం 25లక్షల ఇళ్లు మంజూరు చేస్తోందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రా రూ.10వేల కోట్లు ఇస్తోందని తెలిపారు. రైల్వే ప్రాజెక్టులకోసం కేంద్రం రూ.35వేల కోట్లు మంజూరు చేసింది, మరో రూ.25వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన