సవరించిన అంచనాలపై అధ్యయనం అవసరం
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వేగం
కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏపీ ప్రభుత్వం వేగం పెంచాల్సి ఉందని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉందని చెప్పారు. ఆర్అండ్ఆర్ సమస్యపై దృష్టి పెడితే పనులు వేగంగా జరుగుతాయని సూచించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించారు. సవరించిన అంచనాలను ఎప్పుడు ఆమోదిస్తారో చెప్పాలని కేంద్ర జలశక్తిమంత్రిని అడిగారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2500 కోట్లు సొంత నిధులను ఖర్చు చేసిందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.47వేల 725కోట్ల వ్యయం అవుతుందని రివైజ్డ్ కాస్ట్ కమిటీ అంచనా వేసినట్లు మార్చి 2020లో లోక్సభలో మంత్రి ప్రకటించారని ఎంపీ అన్నారు. కానీ సాంకేతిక నిపుణుల కమిటీ 2017- 18 ధరల ప్రకారం రూ.55 వేల 656 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిందని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్ 2013- 14 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ధరలు పెంచేందుకు అవకాశం లేదని విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలిపారు.
పెరిగిన ధరలపై నిపుణుల కమిటీ ఇచ్చిన సవరించిన అంచనాలను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఇలా చేస్తే నిధుల సమస్య ఉండదని అనుకున్న సమయానికి ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. దీనిపైనా స్పందించిన షెకావత్ పొలవరం నిర్మాణానికి ఎటువంటి నిధులు సమస్య లేదని వివరించారు. నాబార్డ్ నిధులను అందజేస్తామన్నారు. పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను సమర్పించాలన్నారు. వాటి పరిశీలన తర్వాత నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టులో సవరించిన అంచనాలు అధ్యయనం చేయాల్సి ఉందని వివరించారు. అంచనాల అధ్యయనం తర్వాత కేబినేట్కు పంపుతామన్నారు. కేబినేట్ నిర్ణయం మేరకు ముందుకెళ్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..
బ్యాంకుల ప్రైవేటీకరణకు ఆర్బీఐతో పనిచేస్తాం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్