Andhra news: వైకాపా నాయకులు రాష్ట్ర ఖజానాను దోచేశారు: అయ్యన్న పాత్రుడు
జగన్ మూడేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.
విశాఖపట్నం: జగన్ మూడేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మద్యం అమ్మగా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని పాలిస్తామని స్వయంగా సీఎం జగన్ అసెంబ్లీలో అనడం సిగ్గు చేటని ఆయన అన్నారు. విశాఖ తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవుల కోసం శాసనసభ్యులంతా అసెంబ్లీలో జగన్ భజనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాలోని డబ్బులు కూడా దోచేశారని, రూ.48 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు లేవని కాగ్ నివేదికలో చెప్పినట్లు అయ్యన్న గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు చూస్తూ ఊరుకుంటోందని ప్రశ్నించారు.
కాగ్ నివేదికలో పేర్కొన్న రూ.48వేల కోట్ల పైన సీబీఐ విచారణ వేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు. దాదాపు రూ.7లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ సొమ్మును ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. కల్తీ మద్యం తాగి చనిపోయినవారి కుటుంబీకులు ఏడవడంలేదని, సీఎం జగన్ అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇంకా వైకాపా ప్రభుత్వానికి రెండేళ్ల సమయముందని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. ఈనెల 29 నాటికి తెదేపా ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. విజయవాడలో వచ్చే నెల 3న మహానాడు నిర్వహిస్తున్నట్లు అయ్యన్న తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!