Chandrababu: తెదేపా హయాంలో మాత్రమే రంజాన్ కానుక: చంద్రబాబు
ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయటం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు...
గుంటూరు: ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయటం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులోని బి.కన్వెన్షన్ సెంటర్లో తెదేపా ఆధ్వర్యంలో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరయ్యారు. ముస్లిం సంప్రదాయ టోపీ ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెదేపా హయాంలో ముస్లింల కోసం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించిన విషయం గుర్తు చేశారు. ముస్లిం సోదరులు హజ్ యాత్రకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా హైదరాబాద్లో హజ్హౌస్ కట్టించామన్నారు. కల్యాణ మండపాలు, కబరస్తాన్లు కట్టించామని, పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయం చేశామని వివరించారు. రంజాన్ కానుక తెదేపా హయాంలో మాత్రమే ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రజలను కాపాడటం కోసం తాను పోరాడుతానని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... మైనార్టీల కోసం తెదేపా ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. ఇఫ్తార్ విందుకు వచ్చిన చంద్రబాబుకు తెదేపా ముస్లిం కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలను క్రేన్ సాయంతో తెచ్చి అలంకరించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్ కుమార్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక