TDP: వైకాపా ఓడిపోతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు: నిమ్మల

వైకాపా కచ్చితంగా ఓడిపోతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

Published : 22 Aug 2023 16:12 IST

అమరావతి: గోదావరి జిల్లాల్లో వైకాపాకి రెండు సీట్లకు మించి రావంటూ పందేలు కాస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. గన్నవరంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో ఆయన మాట్లాడారు. గోదావరి జిల్లాల్లో వచ్చిన మార్పు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుందన్నారు. వైకాపా కచ్చితంగా ఓడిపోతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని, చంద్రబాబు గేటు తెరిస్తే 70 మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని నిమ్మల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని