AP News: పార్లమెంట్ సాక్షిగా ఏపీ పరువు తీశారు: తెదేపా ఎంపీల ఆగ్రహం
పార్లమెంట్ సాక్షిగా వైకాపా ఎంపీలు రాష్ట్రం పరువు తీశారని తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో
దిల్లీ: పార్లమెంట్ సాక్షిగా వైకాపా ఎంపీలు రాష్ట్రం పరువు తీశారని తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని, జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉందని చెప్పి రాష్ట్ర ఖ్యాతిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల మాట్లాడుతూ.. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది.. మేం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ వైకాపా ఎంపీ భరత్ లోక్సభలో చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. మరో సభ్యుడు రఘురామ కృష్ణరాజు .. రాష్ట్రం సంక్షోభంలో మునిగిపోతోంది.. రక్షించండంటూ జీరో అవర్లో ప్రస్తావించారని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తారు?: రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఏపీ సీఎం జగన్, వైకాపా ఎంపీలందరికీ నాదొక సూటి ప్రశ్న. ప్రత్యేక హోదా ఎప్పుడు తీసుకొని వస్తారు? ఎలా పోరాటం చేస్తున్నారు?. ఈ రెండున్నరేళ్లలో ఒక్క సెషన్లో గానీ, ఒక్కరోజైనా కేంద్రం ఇచ్చిన హామీల కోసం, ఏపీ పునర్విభజన చట్టం ద్వారా మనకు రావాల్సిన నిధుల కోసం దిల్లీలో ఏదైనా పోరాటం చేశారా? ఓట్ల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తాకట్టు పెట్టి ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి గానీ, రాష్ట్రానికి రావాల్సి నిధులు గురించి గానీ, ఉత్తరాంధ్రకు రావాల్సిన రైల్వే జోన్గురించి గానీ.. ఇలా ఎన్నో అంశాలు ఇంకా పెండింగ్లో ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణమేంటని అడుగుతున్నాం’’ అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.