Andhra News: ‘ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే.. ఇప్పుడు ఫ్యాన్ తిరగట్లేదు’
జగన్ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని
నర్సీపట్నం: జగన్ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఛార్జీల పెంపు, కరెంట్ కోతలతో కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. నర్సీపట్నంలో అయన్న మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 6న నర్సీపట్నంలో నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు.
పెరిగిన ఛార్జీల వల్ల కొత్త కంపెనీలు రావని.. ఫలితంగా ఉద్యోగాల కల్పన జరగదని అయ్యన్న అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై రూ.1,400 కోట్ల భారం పడుతోందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించుకున్నారని.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ ఫ్యాన్ తిరిగేందుకు కరెంట్ లేదని అయ్యన్న ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.