Telangana Congress: పార్లమెంట్ అందరిదీ.. మోదీయే పార్లమెంట్లా వ్యవహరిస్తున్నారు: ఉత్తమ్కుమార్రెడ్డి
పార్లమెంట్ ఏవిధంగా ఉండాలో ఆర్టికల్ 79 స్పష్టంగా వివరించిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమారెడ్డి అన్నారు. పార్లమెంట్ వ్యవస్థలో రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఉంటాయన్నారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఏవిధంగా ఉండాలో ఆర్టికల్ 79 స్పష్టంగా వివరించిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమారెడ్డి అన్నారు. పార్లమెంట్ వ్యవస్థలో రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఉంటాయన్నారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలకు అతి తక్కువ రోజులు హాజరైన ప్రధానమంత్రులలో నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉన్నారన్నారు. పార్లమెంట్ అందరిదీ.. మోదీయే పార్లమెంట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎంపీలు హాజరు కావడం లేదని ఉత్తమ్కుమార్రెడ్డి తేల్చి చెప్పారు.
సీఎం మూతి పగిలే తీర్పు ఇస్తారు: మధుయాష్కీ
‘‘ప్రతి నెల మొదటి వారంలో పీఏసీ సమావేశాలు నిర్వహిస్తాం. జూన్ 2 నుంచి భారాస వైఫల్యాలపై 20 రోజుల కార్యక్రమం చేపడతాం. ప్రతి మండల కేంద్రంలో పార్టీ జెండా, జాతీయ జెండా ఎగురవేస్తాం. ఈ 20 రోజులు పార్టీ కార్యకర్తలు తమ ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. 20 రోజుల కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఆహ్వానించాలని నిర్ణయించాం. ‘బీసీ గర్జన’ సభ నిర్వహిస్తాం. 30 శాతం కమీషన్ తీసుకునే ముఖ్యమంత్రికి మూతి పలిగేలా ప్రజలే తీర్పు ఇస్తారు’’ అని పేర్కొన్నారు.
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం: శ్రీధర్ బాబు
‘‘హిమాచల్ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ప్రజలు తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారు. 20 రోజుల కార్యక్రమాల్లో భారాస వైఫల్యాలను ఎండగడతాం. రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం మాట్లాడిన దాంట్లో తప్పేముంది? కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి మాట్లాడితే తప్పులేదు కానీ, హిమాచల్ సీఎం ఇక్కడకు వచ్చి మాట్లాడితే తప్పా’’ అని ప్రశ్నించారు.
భాజపా వాళ్లు ఎప్పుడు మారుతారో..: వీహెచ్
‘‘తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్. ఈ భాజపా వాళ్లు ఎప్పుడేం మాట్లాడుతారో అర్థం కావడం లేదు. నిజాంకు వ్యతిరేకం అని చెప్పుకొనే భాజపా.. గోల్కొండ కోట మీద జెండా ఎగురవేస్తాం అంటే నవ్వొస్తుంది. పంజాగుట్టలో నేను అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని కొట్లాడితే.. నాకు ఎక్కడ పేరు వస్తుందోనని భారాస నేతలు ఏర్పాటు చేశారు’’ అని వీహెచ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?