Alternative to BJP: భాజపాకు ప్రత్యామ్నాయం వారి చేతుల్లోనే..!
దేశంలో భాజపా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు బలమైన ప్రతిపక్షం ఎవరనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు తప్ప మరెవరి నిర్ణయం వల్ల కాదని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దిల్లీ: దేశంలో భాజపా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు బలమైన ప్రతిపక్షం ఎవరనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు తప్ప మరెవరి నిర్ణయం వల్ల కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ఇటీవల జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్తోనూ కలిసి పనిచేసే విషయంపైనా చర్చించలేదన్న ఆయన.. భాజపా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొనే ఎన్నికల సమయంలో ఎన్నో కూటములు (ఫ్రంట్లు) బలపడిన విషయాన్ని గుర్తుచేశారు.
సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు మూడు రోజుల పాటు దిల్లీలో జరిగాయి. ఇందులో భాగంగా పార్టీ రాజకీయ నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీతో సంబంధంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భాజపాకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, దేశంలో ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జనతా పార్టీ ఏర్పడిన తీరును.. తర్వాత యూపీఏ ఏర్పాటును ఏచూరి ఉదహరించారు. ఇలా ప్రత్యామ్నాయాలు ఎప్పుడూ ప్రజల చేతుల్లోనే ఉంటాయని ఏచూరి స్పష్టం చేశారు. గతంలో ఎన్నికల సమయంలో ఏర్పడిన కూటములన్నీ భాజపా వ్యతిరేక దృష్టితోనే బలపడ్డాయని సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు.
ధరల పెరుగుదలపై మండిపాటు..
దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపైనా సీతారాం ఆందోళన వ్యక్తం చేశారు. ఇక 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ మైలురాయిపై మాట్లాడిన సీతారం ఏచూరి.. వ్యాక్సిన్లను ఉచితంగా ఇచ్చేందుకే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు ఓ కేంద్ర మంత్రి పేర్కొనడంపై తీవ్రంగా మండిపడ్డారు. వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.35వేల కోట్లు నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం.. కేవలం ప్రజల దృష్టి మరల్చడానికే ప్రధాని మోదీ 100 కోట్ల డోసుల సంబరాలను నిర్వహించారని విమర్శించారు. ఆలస్యమైనప్పటికీ దేశంలో వందకోట్ల డోసులను పంపిణీ చేయడం అభినందించాల్సిన విషయమన్నారు. ఇదే సమయంలో దేశంలో కేవలం 21 శాతం మంది మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందుకున్న విషయాన్ని గమనించాలని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కమిటీ కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేసిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!