ap politics: తెదేపా నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి: బొత్స సత్యనారాయణ

ఉత్తరాంధ్ర చర్చా వేదిక.. రక్షణ వేదిక పేరిట తెదేపానేతలు పోరాటాలు చేస్తామంటున్నారు.. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పడు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఏపీ

Published : 29 Aug 2021 01:25 IST

విజయనగరం: ఉత్తరాంధ్ర చర్చా వేదిక.. రక్షణ వేదిక పేరిట తెదేపానేతలు పోరాటాలు చేస్తామంటున్నారు.. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వాలు నడిపిన వ్యక్తులు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని, ఆలోచన చేయాలని సూచించారు.

‘‘అధికారం కోల్పోయిన వారు ఇలాంటివి చేయకూడదు. జగన్‌మోహన్‌రెడ్డి సమగ్ర అభివృద్ధితో 3 రాజధానుల నినాదాన్ని తీసుకొచ్చారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే కోర్టుకు వెళ్లారు. ఏ ఒక్క భవనం కట్టకుండా అడ్డుకున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, సుజల స్రవంతి, స్టీల్‌ ప్లాంట్‌, గంగవరం పోర్టుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారు. ఏ హక్కు ఉందని అడుగుతున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను స్వయంగా ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు ఈ విషయం చెప్పారు. మోదీ ప్రభుత్వంలో అశోక్‌ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నారు.. అప్పట్లోనే ఈ ప్రైవేటీకరణ జరిగింది. ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదు. అచ్చెన్నాయుడు, అశోక్‌గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర రక్షకులు కాదు.. భక్షకులు’’ అని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని