Raghunandan Rao: జాతీయ పార్టీలను తిట్టే తెరాసకు దిల్లీలో భవన్ ఎందుకు?
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమై ఐదు రోజులు గడవకముందే తెరాస నేతల్లో భయం మొదలైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హైదరాబాద్లోని..
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమై ఐదు రోజులు గడవకముందే తెరాస నేతల్లో భయం మొదలైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. బండి పాదయాత్రలో పార్టీ కార్యకర్తలు తప్పితే ప్రజలు లేరని తెరాస నేతలు విమర్శిస్తున్నారని.. జనంలేని పాదయాత్ర గురించి తెరాస నేతలెందుకు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. దిల్లీకి బానిసలమైతే.. దిల్లీలో తెరాసకు పార్టీ కార్యాలయం ఎందుకు? దిల్లీకి బానిసలయ్యేందుకే తెరాస భవన్ నిర్మించాలనుకున్నారా? జాతీయ పార్టీలను తిట్టే తెరాసకు దిల్లీలో భవన్ ఎందుకు ?అని నిలదీశారు.
‘‘సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్రను తెలుసుకొని తెరాస ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఆయన భాజపాకు సంబంధించిన వ్యక్తి కాదు. చివరకు పటేల్కు సైతం ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టిన ఘనత తెరాసకే దక్కుతుంది. దేశంలో నిజాం వారసులు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తాం. 111జీవో మీద సీఎం కేసీఆర్ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి. చార్మినార్, గోల్కొండ.. ఇలా ఎక్కడినుంచి అయినా మేం మాట్లాడుతాం. తెరాస ఎమ్మెల్యేలు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి. దేశానికి, జాతీయ వాదానికి భాజపా బానిస. కేంద్రం నిధులు ఇస్తుంటే.. ఏమిచ్చిందని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ముగిసేలోగా రాష్ట్రంలో పీఠాలు కదలడం ఖాయం’’ అని రఘునందన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక