AP Politics: బీసీలకు దక్కాల్సిన నిధులను మళ్లిస్తున్నారు: జీవీఎల్‌

ఏపీలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలకు దక్కాల్సిన నిధులను మళ్లిస్తున్నారని భాజపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. విజయవాడ

Published : 24 Aug 2021 01:39 IST

అమరావతి: ఏపీలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలకు దక్కాల్సిన నిధులను మళ్లిస్తున్నారని భాజపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా, తెదేపాలు బీసీ-ఈ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయకూడదో తమ నిర్ణయాన్ని తెలపాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు వెనుకబడిన తరగతులకు చేసిన ప్రయోజనాలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు. గత ప్రభుత్వాలు బీసీ, ఎస్సీ వర్గాలకు కేవలం అలంకార ప్రాయమైన పదవులను ఇచ్చాయని జీవీఎల్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని