AP News: గొడ్డలిపోటు సూత్రధారి అవినాశ్‌రెడ్డే: లోకేశ్‌

మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి వాంగ్మూలం మేరకు గొడ్డలిపోటు సూత్రధారి అవినాశ్‌రెడ్డేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు

Published : 18 Nov 2021 01:52 IST

అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి వాంగ్మూలం మేరకు గొడ్డలిపోటు సూత్రధారి అవినాశ్‌రెడ్డేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. వివేకా హత్యకేసులో వైకాపా రాష్ట్ర కార్యదర్శిపై పాత్రపై అనుమానాలున్నాయన్నారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి అన్నీ తానై వ్యవహరించే వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవడంతో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ఈకేసు నుంచి అవినాశ్‌రెడ్డిని తప్పించేందుకు సిట్‌ బృందాన్ని మార్చేసి, సీబీఐ విచారణ వద్దన్నది జగనేనని గుర్తు చేశారు. జగన్‌ తన బులుగు మీడియాతో వైఎస్సాసుర చరిత్ర గురించి ఎప్పుడు రాయిస్తారని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని