Jayaram Komati: ఎన్టీఆర్ విగ్రహధ్వంసం ఘటనను ఖండించిన ఎన్నారై జయరాం కోమటి
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనను ప్రవాసాంధ్రుడు జయరాం కోమటి ఖండించారు.
ఇంటర్నెట్డెస్క్: గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహన్ని వైకాపా కార్యకర్త ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన సంగతి సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు, కార్యకర్తలతోపాటు ఎన్నారై తెదేపా నేతలు కూడా ఖండిస్తున్నారు. అమెరికాలో ప్రముఖ ప్రవాసాంధ్రుడు, తెదేపా నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి ఈఘటనను తీవ్రంగా ఖండించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన అన్నగారి విగ్రహంపై ఈ అమానుష ఘటన దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలోని మండల కేంద్రం దుర్గి బస్టాండ్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా నాయకుడు, దుర్గి జడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యల్లమంద కుమారుడు కోటేశ్వరరావు ఆదివారం సుత్తితో విగ్రహంపై పలుమార్లు కొట్టాడు. దీంతో విగ్రహం పలుచోట్ల దెబ్బతింది. స్థానికులు కోటేశ్వరరావును అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై సంఘటన స్థలంలో గుమికూడిన తెదేపా, వైకాపా శ్రేణులను చెదరగొట్టారు. విగ్రహం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా మాచర్ల నియోజకవర్గ బాధ్యుడు బ్రహ్మారెడ్డి డిమాండు చేశారు. ఈ ఘటనపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటేశ్వరరావును స్థానిక పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని గురజాల డీఎస్పీని ఆదేశించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం