Raghurama: పదవీ కాంక్షతో జోగి రమేశ్‌ రగిలిపోతున్నారు

తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.

Updated : 18 Sep 2021 14:09 IST

చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లడం సరికాదు : రఘురామ కృష్ణరాజు

దిల్లీ : తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి వెళ్లడం సరికాదని ఆయన అన్నారు. దిల్లీలో రఘురామ మీడియాతో మాట్లాడారు.

‘జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. శాంతియుత నిరసనకు వెళ్తే అన్ని కార్లలో ఎందుకు వెళ్లారు? మంత్రి పదవిపై కాంక్షతో జోగి రమేశ్‌ రగిలిపోతున్నారు. గతంలో చంద్రబాబుపై.. జగన్‌ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారు. ఆ వ్యాఖ్యలన్నింటికీ జగన్‌ క్షమాపణలు చెబుతారా?’ అని రఘురామ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని