raghuramakrishnaraju: కేసుల నుంచి జగన్‌ కడిగిన ముత్యంలా బయటకు రావాలి: రఘురామ

ఏపీ సీఎం జగన్‌ సీబీఐ, ఈడీ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని కోరుకుంటున్నట్టు నరసాపరం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం

Published : 25 Aug 2021 01:22 IST

దిల్లీ: ఏపీ సీఎం జగన్‌ సీబీఐ, ఈడీ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని కోరుకుంటున్నట్టు నరసాపరం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఏడాదిన్నరగా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారు. వాయిదా వేసేందుకు న్యాయమూర్తికి విచక్షణాధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి అతి త్వరగా కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటకు రావాలనేది నా కోరిక. బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టి వేస్తుందని, ఈనెలఖారులో సీఎం విదేశాలకు వెళ్తారని నిన్న సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూద్దాం’’ అని రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని