AP News: ఆ పథకాలకు పేర్లు మార్చండి.. లేదంటే మేమే మార్చేస్తాం: సోము వీర్రాజు

కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన పథకాలకు ఏపీ ప్రభుత్వం ప్రధాని మోదీ పేరు పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌..

Updated : 05 Jan 2022 12:29 IST

బాపట్ల: కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన పథకాలకు ఏపీ ప్రభుత్వం ప్రధాని మోదీ పేరు పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. పేర్లు మార్చకపోతే భాజపా రాష్ట్ర శాఖే రంగంలోకి దిగి మారుస్తుందని చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలకు మోదీ పేరు పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ దిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలిశారని.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవేను కేంద్ర ప్రభుత్వమే చేపట్టిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని