PM Modi: కేంద్రం నిధులు కొల్లగొట్టేందుకు.. నకిలీ జాబ్ కార్డులు..! మోదీ ధ్వజం
ఉపాధి హామీ పథకం కింద కేంద్ర నిధులను కాజేసేందుకు పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం నకిలీ జాబ్కార్డులు సృష్టించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర సంపదను దోచుకోవడమేగాకుండా ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద కేంద్ర నిధులను కాజేసేందుకు నకిలీ జాబ్కార్డులు సృష్టించిందని ఆరోపించారు. సిలీగుడీలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అవినీతి టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించడం లోక్సభ ఎన్నికలతో మొదలవుతుందన్నారు. అభివృద్ధిని పక్కనపెట్టేసి.. దీదీ తన మేనల్లుడి గురించి, కాంగ్రెస్ పార్టీ తన రాజకుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయని విమర్శించారు.
సోనియాగాంధీ, లాలూ లక్ష్యాలివే: అమిత్ షా
‘దేశంలోని తల్లులు కనీస సౌకర్యాల కోసం ఎంత కష్టపడుతున్నారో చూశాను. అందుకే వారి జీవితాలను సులభతరం చేసేందుకు పారిశుద్ధ్యం, ఉచిత విద్యుత్, బ్యాంక్ అకౌంట్లు, నీటి సదుపాయం వంటి వసతుల కల్పనకు కృషి చేస్తున్నాను. కానీ, బెంగాల్లో గతంలో వామపక్ష కూటమి, ప్రస్తుతం టీఎంసీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల కనీస అవసరాలను విస్మరించాయి’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. సందేశ్ఖాలీ వ్యవహారాన్ని మరోసారి ప్రస్తావిస్తూ.. మహిళలపై అఘాయిత్యాలు, పేదల సంపాదనను దోచుకోవడం వంటివి టీఎంసీ గూండాల లక్షణమని ధ్వజమెత్తారు. ‘టీ- టింబర్- టూరిజం’ (తేయాకు, కలప, పర్యటకం) రంగాలను ప్రోత్సహిస్తూ ఉత్తర బెంగాల్ అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా