UP Election 2022: యూపీ ఎన్నికల కోసం ‘శ్రీవల్లి’ సాంగ్.. మేడ్ బై కాంగ్రెస్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్బస్టర్ ‘పుష్ప’ క్రేజ్ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. సినీ అభిమానులతో పాటు స్టార్ క్రికెటర్లు, ప్రముఖులు ఇందులోని పాటలు, డైలాగ్లను అనుకరిస్తూ
ఇంటర్నెట్డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్బస్టర్ ‘పుష్ప’ క్రేజ్ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. సినీ అభిమానులతో పాటు స్టార్ క్రికెటర్లు, ప్రముఖులు ఇందులోని పాటలు, డైలాగ్లను అనుకరిస్తూ సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకీ ‘పుష్ప’ ఫీవర్ పాకింది. తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సాంగ్ను విడుదల చేసింది. ‘పుష్ప’ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట ట్యూన్ను తీసుకుని యూపీ గొప్పతనాన్ని చెబుతూ ఈ పాటను రూపొందించింది.
‘‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి..’’ పాట మ్యూజిక్తో ‘‘తూ హై గజాబ్ యూ, యూపీ; తేరీ కసమ్, యూపీ(చాలా అందంగా ఉంటావు, యూపీ..) అంటూ వీడియో సాంగ్ను రూపొందించింది. రాణీ లక్ష్మీబాయి వంటి గొప్ప వ్యక్తులు పోరాడిన నేల అంటూ.. రాష్ట్రం గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఈ వీడియో సాంగ్ను యూపీ కాంగ్రెస్ పార్టీ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘ఉత్తరప్రదేశ్ వాసులం అయినందుకు గర్వంగా ఉంది..!’ అంటూ రాసుకొచ్చింది.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు వినూత్న ప్రయత్నాలకు శ్రీకారం చుడుతుంటారు. మొన్నటికి మొన్న పంజాబ్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. 2007లో విడుదలైన హిందీ మల్టీస్టారర్ ‘హే బేబీ’ సినిమాలోని ‘మస్త్ కలందర్’ పాటను ఫొటో ఎడిట్ చేసి రూపొందించిన ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..