రాజ్ ఠాక్రేకు ఆదిత్య ఠాక్రే సెటైర్.. నవనీత్ కౌర్ భర్తకు శివసేన వార్నింగ్!
మహారాష్ట్రలో హానుమాన్ చాలీసా చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిర్దేశించిన గడువులోగా లౌడ్ స్పీకర్లు తొలగించకుంటే మసీదుల వద్ద హనుమాన్ చాలీసా ప్లే చేస్తామంటూ రాజ్ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు.
ముంబయి: మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిర్దేశించిన గడువులోగా లౌడ్ స్పీకర్లు తొలగించకుంటే మసీదుల వద్ద హనుమాన్ చాలీసా ప్లే చేస్తామంటూ రాజ్ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ధరల పెరుగుదలకు కారణాలను లౌడ్స్పీకర్లలో తెలియజేయాలంటూ సెటైర్ వేశారు. ఈ వ్యవహారం ఇలానే కొనసాగుతుండగా.. ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి నవనీత్ కౌర్ భర్త చేసిన వ్యాఖ్యలు శివసేన నేతల్లో ఆగ్రహం తెప్పించాయి.
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఇటీవల మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వానికి ఓ డెడ్లైన్ విధించారు. మే 3వ తేదీలోపు మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు తొలగించకపోతే అక్కడ హానుమాన్ చాలీసాను ప్లే చేస్తామని హెచ్చరించారు. దీనిపై పరోక్షంగా స్పందించిన ఆదిత్య ఠాక్రే.. ‘‘నిత్యావసర ధరలు నిత్యం ఎందుకు పెరుగుతున్నాయో తెలియజేసేలా ప్రజల్లో అవగాహన కల్పించడానికి లౌడ్స్పీకర్లు వినియోగించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారించాలని పరోక్షంగా రాజ్ఠాక్రేకు హితవు పలికారు.
మరోవైపు ‘హనుమాన్ చాలీసా’ వ్యవహారంలో విదర్భ ప్రాంతానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే, నటి నవనీత్ కౌర్ భర్త అయిన రానా జోక్యం చేసుకున్నారు. గతంలో భాజపా ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఈయన.. తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. హనుమాన్ జన్మోత్సవం రోజున ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని సూచించారు. లేదంటే మాతోశ్రీ (ఉద్ధవ్ నివాసం) వద్ద హనుమాన్ చాలీసా వినిపిస్తామని ఆ వీడియోలో పేర్కొన్నారు. దీనిపై శివసేన నేత కిశోరి పెడ్నేకర్ స్పందించారు. శివసైనికులు ఇంకా సజీవంగానే ఉన్నారని, దమ్ముంటే మాతోశ్రీకి వచ్చే సాహసం చేయాలని సవాల్ విసిరారు. మొత్తానికి రాజ్ఠాక్రే వద్ద మొదలైన ‘హనుమాన్ చాలీసా’ వ్యవహారం చుట్టూ మరాఠా రాజకీయాలు తిరుగుతున్నట్లైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?