Pasunuri Dayakar: కాంగ్రెస్‌లో చేరిన వరంగల్‌ భారాస ఎంపీ

లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

Published : 16 Mar 2024 20:39 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి కొండా సురేఖ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన పసునూరి.. భారాస ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 2015 వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక, 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఈసారి భారాస సిటింగ్‌ ఎంపీనైన తనకు టికెట్‌ ఇవ్వకపోవడం బాధ కలిగించిందని అందుకే తాను పార్టీ మారేందుకు సిద్ధమయ్యానని శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం పసునూరి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని