మీరు వద్దంటే నామినేషన్ వేయను: దీదీ
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ రేపు (మార్చి 10న) నామినేషన్ వేయనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు .......
నందిగ్రామ్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ రేపు (మార్చి 10న) నామినేషన్ వేయనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తనను వద్దనుకుంటే తాను నామినేషన్ వేయనన్నారు. కానీ, ప్రజలు తమ కుమార్తెగా తనను భావిస్తే నామినేషన్ వేసే దిశగా ముందుకు సాగుతానన్నారు. తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో కాకుండా ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమతను కొందరు భాజపా నేతలు బయటి వ్యక్తిగా పేర్కొనడంపై దీటుగా స్పందించారు. బెంగాలీనైన తాను బయటి వ్యక్తినైతే.. దిల్లీ నుంచి వచ్చిన మీరేంటని దీదీ ప్రశ్నించారు.
మరోవైపు, బెంగాల్లో భాజపాను ఢీకొట్టి హ్యాట్రిక్ విజయం సాధించాలన్న కసితో దూసుకెళ్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన దీదీ.. ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చారు. ఈ నెల 11న మహా శివరాత్రి రోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు సమాచారం. అదే రోజు ఉదయం నందిగ్రామ్లో శివరాత్రి పూజల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం కోల్కతాకు చేరుకొని కాళీఘాట్ రెసిడెన్సీలో మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలుస్తోంది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా వ్యూహాత్మకంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన దీదీ.. మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు పొందుపరుస్తారోనన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. 291మంది అభ్యర్థులతో ఒకేసారి ప్రకటించిన జాబితాలో 114 మంది కొత్త అభ్యర్థులే కావడం గమనార్హం. రాష్ట్రంలో రాజకీయంగా కీలకంగా ఉన్న 49శాతం మహిళా ఓటర్లు, 30శాతంగా ఉన్న మైనార్టీ ఓటర్లను ఆకర్షించేలా 50 మంది మహిళలు, 42మంది మైనార్టీలకు సీట్లు ఇచ్చారు. అంతేకాకుండా టీఎంసీ జాబితాలో 79మంది ఎస్సీలు, 17మంది ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు చోటు కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.